ఇద్దరు స్పిన్నర్లతో దిగడమే టీమిండియా బలం: పాల్ ఆడమ్స్
- ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో బరిలో దిగడమే లాభిస్తోంది
- విభిన్నమైన కోణాల్లో వైవిధ్యం కలిగిన బంతులు సంధిస్తున్న కుల్దీప్, చాహల్
- ఊరించే బంతులతో ఉచ్చులోకి లాగుతున్న స్పిన్నర్లు
అదే టీమిండియా బలమని, ఆ ఇద్దరూ మణికట్టు స్పిన్నర్లే కావడంతో టీమిండియాకు లాభిస్తోందని తెలిపాడు. ఇద్దరూ విభిన్నమైన కోణాల్లో వైవిధ్యమైన బంతులు సంధిస్తూ బ్యాట్స్ మన్ ను ఉచ్చులోకి లాగుతున్నారని పేర్కొన్నాడు. ఊరించే వీరి బంతులను వెంటాడుతూ బ్యాట్స్ మన్ దొరికిపోతున్నారని పాల్ ఆడమ్స్ తెలిపాడు. టీమిండియా జట్టు కూర్పు కూడా ఇద్దరు స్పిన్నర్లు ఆడేందుకు అనుమతిస్తోందని, చాలా జట్లు ఇద్దరు స్పిన్నర్లకు చోటివ్వవని అన్నాడు. ఇతర జట్లకు, భారత జట్టుకు తేడా ఇదేనని పాల్ ఆడమ్స్ తెలిపాడు.