కోటీశ్వరులైన అండర్-19 ఆటగాళ్లు.. కనీస ధర రూ.20 లక్షలు.. రికార్డు స్థాయిలో కొనుగోలు!

  • అత్యధిక ధరకు అమ్ముడుపోయిన కమలేష్
  • అండర్-19 జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్‌లకు కూడా భారీ రేటు
  • విదేశీ ఆటగాళ్లు దీటుగా ధర
ఐపీఎల్ పుణ్యమా అని టీమిండియా అండర్-19 ఆటగాళ్లు ఒక్క దెబ్బకు కోటీశ్వరులుగా మారిపోయారు. అండర్-19 ప్రపంచకప్‌లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న 18 ఏళ్ల కమలేష్ నాగర్‌కోటిని శనివారం జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఖరీదైన అండర్-19 ఆటగాడు కమలేషే. ఇతని కనీస ధర రూ.20 లక్షలు కాగా ఏకంగా రూ.3.2 కోట్లు పలకడం విశేషం.

అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీషాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. పృథ్వీ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోటీ పడగా చివరికి రూ.1.2 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరి బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా కోటి రూపాయలకు పైగా పలకడం విశేషం.
Go Back to Shorts
Kamlesh Nagarkoti
Under-19
IPL
Auction

More Telugu News