winter: చంపేస్తున్న చలిపులి... 17, 16 డిగ్రీల నుంచి 12 డిగ్రీలకు!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. రుతుపవనాలు వెళ్లిపోయిన తరువాత, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు ఈ సీజన్ లో కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఐదారు రోజుల క్రితం సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలుగా ఉండగా, ఇప్పుడది పగలు 24 డిగ్రీలకు, రాత్రి పూట 16 నుంచి 17 డిగ్రీలకు పడిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చలి ఉండే ప్రాంతమైన అరకులోయలో ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది.

మోదకొండమ్మ పాదాలు, బొర్రా గుహలు తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి. పొగమంచు కమ్మేసిన వేళ, రహదారులపై రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి. ఇక గత రాత్రి హైదరాబాద్ లో 18 డిగ్రీలు, విజయవాడలో 20 డిగ్రీలు, విశాఖపట్నంలో 21 డిగ్రీలు, నిజామాబాద్ లో 17 డిగ్రీలు, అరకులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆకాశంలో మేఘాలు లేక నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Go Back to Shorts
winter
cold
heat

More Telugu News