టీమిండియాపై 4-1 తేడాతో ఓడిపోవడంపై ఆసీస్ కెప్టెన్ స్పందన
- ఓటమికి మేము అర్హులమే
- వరుసగా వికెట్లు కోల్పోయాం
- భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు
- టీ20లోనైనా గెలుస్తాం
చివరి వన్డేలో తాము 300 పరుగులు చేస్తే బాగుండేదని... 50 నుంచి 60 పరుగులు తక్కువ చేయడం వల్లే ఓటమిపాలయ్యామని స్మిత్ చెప్పాడు. టాప్ ఆర్డర్ లో ఒక బ్యాట్స్ మెన్ భారీ స్కోరు చేస్తే బాగుండేదని... దీనికి విరుద్ధంగా, తాము వరుసగా వికెట్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ లో తమ ఆటగాళ్లు బాగానే రాణించారని... అయినా దీన్ని ఓటమికి సాకుగా చూపబోమని చెప్పాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని... జట్టు సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉందని కితాబిచ్చాడు. టీ20లో మెరుగైన ప్రదర్శన చేస్తామని... ఈ ట్రోఫీనైనా ఇంటికి తీసుకెళతామని చెప్పాడు.