vijayendra prasad: రాజమౌళి దర్శకత్వంలో 'మహాభారతం' తప్పకుండా ఉంటుంది!
బలమైన కథా కథనాలతో భారీ చిత్రాలను తెరకెక్కించాలనుకున్న దర్శక నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే రచయిత విజయేంద్ర ప్రసాద్. కథలో ఆసక్తికరమైన ఘట్టాలు .. అనూహ్యమైన మలుపులతో ఆయన ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తూ, మరో లోకానికి తీసుకెళతారు. అప్పుడప్పుడు దర్శకుడిగా కూడా తన అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు.
అలా ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'శ్రీవల్లి' .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా 'మహాభారతం' ప్రస్తావన వచ్చింది. అప్పుడాయన స్పందిస్తూ రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదనీ, అయితే ఆయన తప్పకుండా తీసే అవకాశం ఉందని అన్నారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చని చెప్పారు.
అలా ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'శ్రీవల్లి' .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా 'మహాభారతం' ప్రస్తావన వచ్చింది. అప్పుడాయన స్పందిస్తూ రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదనీ, అయితే ఆయన తప్పకుండా తీసే అవకాశం ఉందని అన్నారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చని చెప్పారు.