'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు!
ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా చూస్తున్నారు. పోస్టర్లకు .. టీజర్లకు .. ఆడియోకు ఒక రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో, సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21న విడుదల కానుంది.