Arcelor Mittal: ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన... ప్రధాని మోదీ స్పందన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో భారీ అధ్యాయం మొదలైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) ఇండియా ఏర్పాటు చేయనున్న మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు సోమవారం శంకుస్థాపన జరిగింది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్గా నిలవనున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా, పారిశ్రామిక ఆవిష్కరణలలో ఏపీని ముందంజలో నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఉక్కు రంగ ప్రముఖులు లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ పాల్గొన్నారు. మొత్తం రూ.1.35 లక్షల కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ప్రాజెక్టును దశలవారీగా చేపట్టనున్నారు. తొలిదశలో రూ.70,000 కోట్లతో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ప్లాంట్ను నిర్మిస్తారు. 2029 మొదటి త్రైమాసికం నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం అనడానికి మరో బలమైన ఉదాహరణ. మా రాష్ట్రంపై అంతర్జాతీయ వాణిజ్య వర్గాలకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది" అని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ, "భారతదేశంతో మా భాగస్వామ్యంలో ఇది ఒక నూతన అధ్యాయం. నా 50 ఏళ్ల ఉక్కు పరిశ్రమ అనుభవంలో, ఇక్కడ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ఒక మధురానుభూతి" అని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వంతో ఏఎంఎన్ఎస్ రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నూతన తరం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడమే ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఉక్కు రంగ ప్రముఖులు లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ పాల్గొన్నారు. మొత్తం రూ.1.35 లక్షల కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ప్రాజెక్టును దశలవారీగా చేపట్టనున్నారు. తొలిదశలో రూ.70,000 కోట్లతో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ప్లాంట్ను నిర్మిస్తారు. 2029 మొదటి త్రైమాసికం నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం అనడానికి మరో బలమైన ఉదాహరణ. మా రాష్ట్రంపై అంతర్జాతీయ వాణిజ్య వర్గాలకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది" అని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ, "భారతదేశంతో మా భాగస్వామ్యంలో ఇది ఒక నూతన అధ్యాయం. నా 50 ఏళ్ల ఉక్కు పరిశ్రమ అనుభవంలో, ఇక్కడ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ఒక మధురానుభూతి" అని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వంతో ఏఎంఎన్ఎస్ రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నూతన తరం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడమే ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం.