KCR: ఫాంహౌస్ లో కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్

KTR Meets KCR at Erravelli Farmhouse
  • ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కొనసాగుతున్న భేటీ
  • మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై కొనసాగుతున్న చర్చ
  • నిన్న కేసీఆర్ తో భేటీ అయిన హరీశ్ రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో వీరి భేటీ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ తో నిన్న హరీశ్ రావు భేటీ అయిన సంగతి తెలిసిందే. సిట్ అడిగే ప్రశ్నలు, సమాధాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కు అందిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై నిన్న హరీశ్ తో, ఈరోజు కేటీఆర్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలి, మీడియా ముందుకు ఎలాంటి అంశాలను తీసుకెళ్లాలనే అంశాలపై చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గించాలనే పట్టుదలతో ఉంది. 
KCR
KTR
BRS Party
Telangana Politics
Phone Tapping Case
SIT Investigation
Harish Rao
Municipal Elections
Erravelli Farmhouse
Telangana

More Telugu News