JP Nadda: ఢిల్లీలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

JP Nadda Attends Christmas Celebrations in Delhi
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా బుధవారం ఢిల్లీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మానవాళి శ్రేయస్సు, అందరి సంక్షేమం కోసం పాటుపడాలన్న యేసుక్రీస్తు బోధనలను ఈ సందర్భంగా నడ్డా గుర్తు చేశారు. ఢిల్లీలోని క్రిస్టియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మావో నాగా క్రిస్టియన్ ఫెలోషిప్ ఢిల్లీ (ఎంఎన్‌సీఎఫ్‌డీ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సివిల్ లైన్స్‌లోని రాజ్‌పూర్ రోడ్డు చర్చిలో జరిగింది.

యేసుక్రీస్తు మానవాళికి ప్రేమ, కరుణ, సేవలను బోధించారని నడ్డా పేర్కొన్నారు. ఇంతటి ఆత్మీయ సమావేశంలో భాగం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. నాగాలాండ్‌లో కొత్తగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీస్తు బోధనలను స్ఫూర్తిగా తీసుకుని మానవాళి శ్రేయస్సు కోసం పని చేయాలని ఆయన కోరారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి, జాతీయ అధికార ప్రతినిధి అనిల్ కె ఆంటోనీ, ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, భారతీయ క్రిస్టియన్ మంచ్ ఛైర్మన్, జాతీయ ప్రతినిధి టామ్ వడక్కన్‌తో పాటు పలువురు సీనియర్ పాస్టర్లు, క్రైస్తవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Go Back to Shorts
JP Nadda
BJP
Christmas celebrations Delhi
Christian Higher Secondary School
Mao Naga Christian Fellowship Delhi

More Telugu News