‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి.. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన
- నిరంతరం ప్రజల్లో ఉండాలని హితవు
- ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న టీడీపీ అధినేత
- పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలన్న చంద్రబాబు
‘పేదల సేవలో’ కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని నేతలకు తెలిపారు. 'పేదల సేవలో' కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం ప్రస్తుతం 25 వేలకు చేరిందని చంద్రబాబు వెల్లడించారు.