నటుడు రాహుల్ రామకృష్ణ 'ఎక్స్' ఖాతా యాక్టివేట్.. ఆసక్తికర ట్వీట్
- గొప్ప మేధావులు చాలాకాలంగా సామాజిక సమస్యలపై పోరాడుతున్నారని వ్యాఖ్య
- పాలన, పరిపాలన గురించి తనకు ఏమీ తెలియదన్న రాహుల్ రామకృష్ణ
- తాను ఒక చిన్న నటుడిని మాత్రమేనని వ్యాఖ్య
ఈ ట్వీట్లపై దుమారం రేగడంతో రాహుల్ 'ఎక్స్' ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆయన ఖాతా తిరిగి యాక్టివేట్ అయింది. అదే సమయంలో ఆయన ఒక ట్వీట్ చేశారు.
తన కంటే గొప్ప మేధావులు చాలా కాలంగా సామాజిక సమస్యలపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. పాలన, పరిపాలన గురించి తనకు ఏమీ తెలియదని, తాను ఒక చిన్న నటుడిని మాత్రమేనని అన్నారు. పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత తన అసహనం సరైనది కాదని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎవరు పాలించినా మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.
ఇకపై 'ఎక్స్' ద్వారా రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. వ్యవస్థతో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. తన వృత్తి అయిన సినిమాలపై దష్టి సారిస్తానని పేర్కొన్నారు. చివరలో "జై తెలంగాణ, జై హింద్" అంటూ ముగించారు.