ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు: హరీశ్ రావు
- యూరియా కష్టాలపై హరీశ్ రావు మండిపాటు
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు కష్టాలన్న హరీశ్
- యూరియా కష్టాలు ఎప్పుడు తీరుస్తారని సీఎంకు ప్రశ్న
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దర్జాగా బతికిన రైతు.. నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం ఇలాంటి అవస్థలు పడటం అత్యంత బాధాకరమని హరీశ్ అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు అనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ఆయన ఆయన ప్రశ్నించారు. రైతుల యూరియా కష్టాలను ఇంకెప్పుడు తీరుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతులందరికీ సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.