Kash Patel: నైట్ క్లబ్బుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు: ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్పై మాజీ అధికారి సంచలన ఆరోపణలు
- ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్పై మాజీ అధికారి ఫ్రాంక్ ఫిగ్లియుజ్జి విమర్శలు
- విధుల కన్నా నైట్క్లబ్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపణ
- రోజువారీ బ్రీఫింగ్లను వారానికి రెండుకు కుదించారని వ్యాఖ్య
- వనరుల దుర్వినియోగంపై విచారణ చేయాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్పై ఆ సంస్థ మాజీ ఉన్నతాధికారి ఫ్రాంక్ ఫిగ్లియుజ్జి సంచలన ఆరోపణలు చేశారు. పటేల్ తన అధికారిక విధులకు హాజరుకావడం కంటే నైట్క్లబ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారని, ఆయన పనితీరు గందరగోళంగా ఉందని ఫిగ్లియుజ్జి విమర్శించారు. ఎఫ్బీఐలో కౌంటర్ ఇంటెలిజెన్స్కు అసిస్టెంట్ డైరెక్టర్గా గతంలో పనిచేసిన ఫిగ్లియుజ్జి, ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫిగ్లియుజ్జి మాట్లాడుతూ, "హూవర్ భవనంలోని ఏడో అంతస్తులో (ఎఫ్బీఐ ప్రధాన కార్యాలయం) కంటే కాష్ పటేల్ ఇప్పుడు నైట్క్లబ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని నివేదికలు వస్తున్నాయి" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, రోజువారీగా జరగాల్సిన కీలక బ్రీఫింగ్లను సైతం వారానికి రెండుసార్లకు తగ్గించారని ఆయన ఆరోపించారు. "ఇది ఒక రకంగా మంచిది, మరో రకంగా ప్రమాదకరం. ఎందుకంటే ఆయన అనుభవం లేకుండా ఏవైనా పనులు చేయాలని ప్రయత్నిస్తే అవి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ప్రస్తుతం ఏజెంట్లు పనిచేయడానికి ఆయన అనుమతిస్తున్నారు. కానీ వారి పనితీరు ఎటువైపు వెళుతుందో స్పష్టత లేదు" అని ఫిగ్లియుజ్జి ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, కాష్ పటేల్ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఏజెన్సీకి చెందిన ప్రైవేటు విమానాలను ఆయన వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
భారతీయ మూలాలున్న కాష్ పటేల్ మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్కు అత్యంత విధేయుడిగా వ్యవహరించారని గతంలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడానికి పటేల్ సరైన వ్యక్తి అని ట్రంప్ భావించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే 2020లో ట్రంప్ ఆయన్ను సీఐఏ డైరెక్టర్గా నియమించాలని భావించినా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత తన పదవీకాలం చివరి రోజుల్లో ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్గా నియమించాలని ప్రయత్నించారు. కాష్ పటేల్, ట్రంప్ ప్రతిపాదించిన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అజెండాకు గట్టి మద్దతుదారుగా నిలిచారు.
ఫిగ్లియుజ్జి మాట్లాడుతూ, "హూవర్ భవనంలోని ఏడో అంతస్తులో (ఎఫ్బీఐ ప్రధాన కార్యాలయం) కంటే కాష్ పటేల్ ఇప్పుడు నైట్క్లబ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని నివేదికలు వస్తున్నాయి" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, రోజువారీగా జరగాల్సిన కీలక బ్రీఫింగ్లను సైతం వారానికి రెండుసార్లకు తగ్గించారని ఆయన ఆరోపించారు. "ఇది ఒక రకంగా మంచిది, మరో రకంగా ప్రమాదకరం. ఎందుకంటే ఆయన అనుభవం లేకుండా ఏవైనా పనులు చేయాలని ప్రయత్నిస్తే అవి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ప్రస్తుతం ఏజెంట్లు పనిచేయడానికి ఆయన అనుమతిస్తున్నారు. కానీ వారి పనితీరు ఎటువైపు వెళుతుందో స్పష్టత లేదు" అని ఫిగ్లియుజ్జి ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, కాష్ పటేల్ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఏజెన్సీకి చెందిన ప్రైవేటు విమానాలను ఆయన వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
భారతీయ మూలాలున్న కాష్ పటేల్ మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్కు అత్యంత విధేయుడిగా వ్యవహరించారని గతంలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడానికి పటేల్ సరైన వ్యక్తి అని ట్రంప్ భావించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే 2020లో ట్రంప్ ఆయన్ను సీఐఏ డైరెక్టర్గా నియమించాలని భావించినా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత తన పదవీకాలం చివరి రోజుల్లో ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్గా నియమించాలని ప్రయత్నించారు. కాష్ పటేల్, ట్రంప్ ప్రతిపాదించిన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అజెండాకు గట్టి మద్దతుదారుగా నిలిచారు.