జగన్ పై దాడి చేయాలనుకున్నారు: గోరంట్ల మాధవ్
- జగన్ కు భద్రత తగ్గిస్తున్నారన్న గోరంట్ల మాధవ్
- రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించిందని విమర్శ
- చేసిన పనులకు రామగిరి ఎస్సై సిగ్గుపడాలని వ్యాఖ్య
జగన్ రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని మాధవ్ అన్నారు. జగన్ పర్యటనలో 11 వందల మంది పోలీసులతో భద్రత కల్పించామని హోంమంత్రి అనిత చెబుతున్నారని... వీరిలో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి వద్దే పెట్టారని మండిపడ్డారు. హెలికాప్టర్ ను ఇబ్బందులకు గురి చేసి... మార్గమధ్యంలో జగన్ పై దాడి చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు. రామగిరి ఎస్సై చేసిన పనులకు సిగ్గుపడాలని అన్నారు. సోషల్ మీడియాలో ఎస్సై పోస్టులు పెట్టడం హాస్యాస్పదమని చెప్పారు.