కోహ్లీ సెంచరీపై అనుష్క శర్మ స్పందన
- పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ
- కోహ్లీ సెంచరీపై సోషల్ మీడియా వేదికగా అనుష్క శర్మ హర్షం
- సోషల్ మీడియాలో వైరల్గా అనుష్క ఇన్స్టా స్టోరీ
కోహ్లీ సెంచరీపై ఆయన అర్ధాంగి, నటి అనుష్క శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంటి నుంచి చూసిన అనుష్క.. టీవీలో విరాట్ కోహ్లీ సెంచరీ సంబరాల ఫోటోను తీసి పంచుకున్నారు. దానికి లవ్, హైఫై ఎమోజీలను జత చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు సెంచరీ సాధించడంతో కోహ్లీ తన మెడలోని గొలుసుకు ఉన్న వెడ్డింగ్ రింగ్ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విక్టరీ సింబల్ చూపించాడు. ప్రస్తుతం అనుష్క చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.