కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్, మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి
- 30 మంది మృతి చెందడం కలచివేసిందన్న కేటీఆర్
- గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్
- మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్
తొక్కిసలాట కారణంగా కుంభమేళాలో 30 మంది మృతి చెందిన విషయం తనను కలచివేసిందని కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్
కుంభమేళా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.