ఏపీ సీఎం చంద్రబాబు విశాల దృక్పథం కలిగిన వ్యక్తి: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు
- దావోస్ లో చంద్రబాబుతో మాట్లాడానన్న శ్రీధర్ బాబు
- పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని వెల్లడి
- వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్యలు
ఏపీకి తీర ప్రాంతం, అపారమైన వనరులు ఉన్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పరిశ్రమలు వస్తాయని అన్నారు. వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
దావోస్ లో ఏపీ పలు కంపెనీలతో ఎంవోయూలు కూడా చేసుకుందని వెల్లడించారు. అయితే, ఎంవోయూలను ఏపీలోనే ప్రకటిస్తామని దావోస్ లో నారా లోకేశ్ చెప్పారని శ్రీధర్ బాబు వివరించారు.