Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ

Padmabhushan for Nandamuri Balakrishna
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించింది. కళల రంగంలో బాలకృష్ణకు (ఏపీ) పద్మభూషణ్ అవార్డు వచ్చింది. తెలంగాణ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను (ప్రజావ్యవహారాలు) పద్మశ్రీ వరించింది.

మిరియాల అప్పారావు (కళలు-ఏపీ), కేఎల్ కృష్ణ (సాహిత్యం-ఏపీ), మాడుగుల నాగఫణిశర్మ (కళలు-ఏపీ), పంచముఖి రాఘవాచార్య (సాహిత్యం-ఏపీ) పద్మశ్రీ అవార్డు వచ్చాయి. 

కన్నడ నటుడు అనంతనాగ్‌కు (కళలు), తమిళ నటుడు అజిత్ కుమార్ (కళలు), తమిళ సీనియర్ నటి శోభనకు(కళలు), మహారాష్ట్రకు చెందిన శేఖర్ కపూర్ (కళలు), కేరళ హాకీ క్రీడాకారుడు శ్రీజేష్, ఢిల్లీకి చెందిన బబేక్ దేబ్రయ్ (సాహిత్యం), మహారాష్ట్రకు చెందిన మనోహర్ జోషి (ప్రజావ్యవహారాలు), బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోదీ (ప్రజావ్యవహారాలు) పద్మభూషణ్ వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.

Go Back to Shorts
Balakrishna
Manda Krishna Madiga
Telangana
Andhra Pradesh
Padma Shri

More Telugu News