ఖైరతాబాద్లో కూల్చివేతలను అడ్డుకున్న దానం నాగేందర్... అధికారులపై ఆగ్రహం
- షాదాన్ కాలేజీ ఎదుట పుట్పాత్ల ఆక్రమణల కూల్చివేత చేపట్టిన అధికారులు
- కూల్చివేతలను సంయుక్తంగా చేపట్టిన బల్దియా, ట్రాఫిక్ పోలీసులు
- తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని దానం నాగేందర్ ఆగ్రహం
- సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు వేచి చూడాలని స్పష్టీకరణ
పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం ఏమిటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకుంటే మాత్రం ఆందోళన చేస్తానని హెచ్చరించారు.