హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్

Perni Nani files petition in AP High Court
  • గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసు
  • పేర్ని నానిని ఏ6గా చేర్చిన పోలీసులు
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పేర్ని నాని పిటిషన్
తమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ  హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది. 

మరోవైపు, ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరయింది. కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు మాత్రం మచిలీపట్నం సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.
Advertisement
Perni Nani
YSRCP
AP High Court

More Telugu News