ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్లో కౌంటింగ్ సరళి ఎలా ఉందంటే..!
- ఆరంభ ట్రెండ్స్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రియాంక
- ప్రధాన పోటీదారులుగా ఉన్న సీపీఐ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్
- 5 లక్షల మెజారిటీ లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్
- ప్రచారంలో పాల్గొన్న సోనియా, రాహుల్ గాంధీలు
వయనాడ్ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వయనాడ్తో పాటు రాయబరేలీలో గెలిచారు. అయితే రాయబరేలీ అట్టిపెట్టుకొని వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగారు. ఆమెను 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంగా తల్లి సోనియా గాంధీతో పాటు అన్న రాహుల్ గాంధీ కూడా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా 2019లో రాహుల్ గాంధీ తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.