Jagan: ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన జగన్

Jagan pays tributes to YSR in Idupulapaya
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ ఇవాళ బెంగళూరు నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వచ్చారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జగన్ ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

అనంతరం పులివెందుల బయల్దేరి వెళ్లారు. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడ్రోజుల పాటు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. జగన్ ఇడుపులపాయ పర్యటనకు సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి విడదల రజని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Go Back to Shorts
Jagan
Idupulapaya
YSR
YSRCP
Pulivendula

More Telugu News