మూసీ నది సర్వనాశనానికి కాంగ్రెస్ పార్టీనే కారణం: బండి సంజయ్
- మూసీ ప్రక్షాళన అంశంలో కాంగ్రెస్ × బీజేపీ
- మూసీ పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు తిరగాలన్న బండి సంజయ్
- సీఎం రేవంత్ రెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
మూసీ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, మూసీ సుందరీకరణా? లేక, పునరుజ్జీవమా? అనేదానిపై స్పష్టత లేదన్నారు. గతంలో లక్షన్నర కోట్లు ఖర్చు అన్నారు... ఇప్పుడు ఆ మాట అనలేదంటున్నారు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరిట డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.