మధుమేహ రోగులకు శుభవార్త.. ఇకపై వారానికి ఒకసారే ఇన్సులిన్ ఇంజక్షన్!
- స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో యూరోపియన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిక్ వార్షిక సదస్సు
- హాజరైన గుంటూరు షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్కుమార్
- త్వరలోనే భారత్లో అందుబాటులోకి క్యూఎల్ఐ ఇంజెక్షన్
స్పెయిన్లోని మాడ్రిడ్లో నిర్వహించిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిక్ వార్షిక సదస్సుకు 30 దేశాల నుంచి 13 వేలకు పైగా వైద్యులు హాజరయ్యారు. ఇందులో మధుమేహం నూతన చికిత్సా విధానాలు, పరికరాలపై చర్చించినట్టు డాక్టర్ రామ్కుమార్ తెలిపారు. ఆహార నియంత్రణ పాటిస్తూ, లోక్యాలరీ డైట్ తీసుకుంటూ వారానికి ఒక్కసారి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నా సరిపోతుందని బ్రిటన్కు చెందిన ప్రొఫెసర్ రాయ్ టేలర్ చేసిన పరిశోధనల్లో వెల్లడైనట్టు డాక్టర్ రామ్కుమార్ వివరించారు.