నటి కాదంబరి జెత్వానీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ పోలీసులు
- ముంబయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపులు
- ఏపీ పోలీసులకు ఫిర్యాదు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
జెత్వానీ ఫిర్యాదు నేపథ్యంలో... కుక్కల విద్యాసాగర్, మరికొందరు వ్యక్తులపై ఇబ్రహీపట్నం పీఎస్ లో కేసు నమోదైంది. 192, 211, 218, 220, 354, 420, 467, 469, 471, రెడ్ విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి కాదంబరి జెత్వానీ ఇవాళ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు అందించారు.
జెత్వానీ వ్యవహారంలో పలువురు వైసీపీ అగ్రనేతలు, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.