నా కూతురుకు ఈ దేశం గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చింది: వినేశ్ ఫొగాట్ తల్లి

Vinesh Phogat mother on her daughter
  • స్వాగతం పలికేందుకు గ్రామస్తులు, బంధువులు తరలి వచ్చారన్న తల్లి
  • దేశమంతా నా కూతురును గౌరవిస్తున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్య
  • కూతురు ఇంటికి వచ్చాక హల్వా తినిపిస్తానన్న తల్లి
నా బిడ్డే నాకు ఛాంపియన్, ఆమెకు ఈ దేశం గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ ఆత్మీయతను, గౌరవాన్ని ఇచ్చిందని వినేశ్ ఫొగాట్ తల్లి ప్రేమలత అన్నారు. తమ గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఫొగాట్‌కు ఘన స్వాగతం పలికేందుకు తరలి వచ్చారన్నారు. తన కూతురును ఘనంగా సత్కరిస్తామన్నారు. దేశమంతా తన కూతురును గౌరవిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఆమె ఇంటికి చేరుకున్నాక హల్వా తినిపిస్తానన్నారు. 

ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో ఫైనల్లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. అనర్హత వేటు నేపథ్యంలో తనకు కాంస్యం ఇవ్వాలంటూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించారు. సీఏఎస్‌లో ఆమెకు చుక్కెదురైంది.
Go Back to Shorts
Vinesh Phogat
Sports News
Paris Olympics

More Telugu News