మరోసారి ఆసుపత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ
- ఇటీవల తరచుగా అనారోగ్యం బారినపడుతున్న అద్వానీ
- తాజాగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స
- నిలకడగా అద్వానీ ఆరోగ్యం
గత నెలలోనూ అద్వానీ ఆరోగ్య సమస్యలతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండ్రోజుల పరిశీలనలో ఉంచిన వైద్యులు, ఆపై ఆయనను డిశ్చార్జి చేశారు. ఇటీవల కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. 96 ఏళ్ల అద్వానీ ఇటీవల కాలంలో తరచుగా అనారోగ్యం బారినపడుతున్నారు.