తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ
- ఈ నెల 5 హత్యకు గురైన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్
- ఇంటికి వెళ్లి నివాళులు అర్పించిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే
- ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
చెన్నైలో నిర్మాణంలో ఉన్న ఆయన ఇంటి బయట కొంతమంది వ్యక్తులు ఆర్మ్స్ట్రాంగ్ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఓ నిందితుడు ఆదివారం నాడు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిని ఎన్కౌంటర్ చేశారు.