ప్రతీకారం తీర్చుకుంటాం.. కథువా ఉగ్రదాడిపై భారత సైన్యం రియాక్షన్

Wont Go Unavenged Indias Strong Message After Kathua Ambush Kills 5
  • అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపిన డిఫెన్స్ సెక్రెటరీ
  • వారి త్యాగాన్ని దేశం మరవబోదంటూ వ్యాఖ్య
  • కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై గ్రనేడ్ దాడి.. ఐదుగురు సోల్జర్ల మృత్యువాత
కథువా ఉగ్ర దాడిలో అమరులైన జవాన్ల ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె స్పష్టం చేశారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈమేరకు మంగళవారం గిరిధర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు దీటుగా జవాబిస్తామని తేల్చిచెప్పారు. ‘కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు వీర జవాన్లు అమరులు కావడం విచారకరం. వారి మరణానికి ఆర్మీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఉగ్రవాదులకు గట్టిగా జవాబిస్తాం’ అంటూ ట్వీట్ చేశారు. 

సోమవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్ లోని కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. తొలుత కాన్వాయ్ పైకి గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు.. వాహనాలలో నుంచి కిందికి దిగిన సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆపై ఉగ్రవాదులు దగ్గర్లోని అడవిలోకి పారిపోయారు.

ఈ దాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత కశ్మీర్ టైగర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్ లో ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లోనే సైన్యంపై ఉగ్రవాదులు రెండుసార్లు దాడి చేశారు. కుల్గాంలో శనివారం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో భారత సైన్యం ఇద్దరు జవాన్లను కోల్పోయింది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టింది.
Go Back to Shorts
Indian Army
Kathua Ambush
Terror Attack
JCO
Five soldiers dead

More Telugu News