జేడీయూ నుంచి ఇద్దరికి ఎన్డీయే క్యాబినెట్ బెర్తులు!
- రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ
- కేంద్ర మంత్రి వర్గ జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్న వైనం
- జేడీయూ ఎంపీలు లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు మంత్రి పదవులు!
ఈ నేపథ్యంలో కొంత కీలక సమాచారం బయటికి వచ్చింది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఖరారైనట్టు తెలుస్తోంది. జేడీయూ ఎంపీలు లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు మోదీ క్యాబినెట్ లో చోటు లభించిందంటూ జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు రాగా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ 16, జేడీయూ 14 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవడంతో మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. అందుకే, రెండంకెల్లో ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ, జేడీయూలకు మోదీ 3.0 క్యాబినెట్లో సముచిత స్థానం లభించే అవకాశాలున్నాయి.