Pinnelli Ramakrishna Reddy: అలా ఉపశమనం.. ఇలా ప్రత్యక్షం.. నరసరావుపేటకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

Macherla YCP MLA Pinnelli Ramakrishna Reddy Now In Narasaraopet
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. మూడు కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు.

ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు. 

ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, తనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు.
Go Back to Shorts
Pinnelli Ramakrishna Reddy
YSRCP
Macherla
EVM
AP High Court
Palnadu

More Telugu News