అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన పిన్నెల్లి

Pinnelli reacts on propaganda that he went underground
పోలింగ్ అనంతరం హింస, తదితర పరిణామాల నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గృహ నిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. గన్ మన్లను కూడా వదిలేసి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగింది. 

కారంపూడి ఘటనల తర్వాత పిన్నెల్లి సోదరులు ఇద్దరూ కనిపించకుండా పోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. 

తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాదులో ఉన్నానని వెల్లడించారు. ఎటో వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదని పిన్నెల్లి పేర్కొన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లానంటూ తనపై జరుగుతున్నది దుష్ప్రచారం అంటూ ఖండించారు.
Go Back to Shorts
Pinnelli Ramakrishna Reddy
Macherla
YSRCP
TDP
Palnadu District

More Telugu News