కొత్త యూజర్లకు ఛార్జీలు.. ‘ఎక్స్’ ఉచిత వినియోగానికి గుడ్బై !
- త్వరలోనే అమల్లోకి రానున్న కొత్త విధానం
- తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో పరిశీలన
- ప్రకటించిన ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్
కాగా ఫీజు విధింపును ఎలాన్ మస్క్ సమర్థించారు. ఇబ్బందులు కలగజేస్తున్న స్పామ్ బాట్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ ఖాతాలు, ఆటోమేటెడ్ బాట్లను అరికట్టడమే లక్ష్యంగా కొత్త యూజర్లకు రైటింగ్ యాక్సెస్ ఇచ్చేందుకు నామమాత్రపు రుసుము తప్పనిసరి చేస్తున్నామని మస్క్ అన్నారు. కాగా ఛార్జీలు విధిస్తే స్పామ్ కార్యకలాపాలు ఎలా పరిష్కృతమవుతాయని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నకిలీ ఖాతాలు, ఆటోమేటెడ్ బాట్లను ఎక్స్ ఎలా నిరోధించగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.