V Hanumantha Rao: అధికారం పోయినా అహంకారం తగ్గలేదు: కేసీఆర్ పై వీహెచ్ మండిపాటు

V Hanumantha Rao fires on KCR
  • సీఎంగా ఉన్నంత కాలం ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ లో ఉండేవారన్న వీహెచ్
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆదరణను ఓర్చుకోలేకపోతున్నారని విమర్శ
  • సోమేశ్ కుమార్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తామన్న వీహెచ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదని ఆయన విమర్శించారు. నల్గొండలో భారీ బహిరంగసభ ద్వారా ప్రజల్లోకి కేసీఆర్ వెళ్తున్నారని... గత పదేళ్ల కాలంలో ఏనాడైనా ప్రజల్లోకి ఆయన వెళ్లారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం... ఉంటే ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ లో ఉండేవారని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే...  కృష్ణా జలాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వీహెచ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, ఓర్చుకోలేకపోతున్నారని... ఫ్రస్ట్రేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అవినీతిపై కూడా దర్యాప్తు చేయిస్తామని అన్నారు. 

  • Loading...

More Telugu News