సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం: మంత్రి సీతక్క
- మేడారంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు సీతక్క, పొన్నం
- దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమన్న మంత్రి సీతక్క
- ప్రతి ఒక్కరూ అమ్మవార్లను దర్శించుకోవాలని సూచన
- దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రులు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు జాతీయ హోదా దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జాతర ఉంటుందన్నారు. ఆ నాలుగు రోజులు దేవతలు గద్దెలపై కొలువై ఉంటారన్నారు. బహుశా దేశంలో ఎలాంటి టిక్కెట్ లేని దేవాలయం ఇదొక్కటే కావొచ్చు అన్నారు. కుల, మత వివక్ష లేదని... అందరూ వన దేవతలను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. జాతర పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టినట్లు తెలిపారు. గత జాతరలో 2800 బస్సులు మాత్రమే నడిపారని... ఈసారి 6000 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.