లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
  • 354 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 82 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా వరకు లాభాల్లోనే కొనసాగిన సూచీలు... చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోయి 71,731కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 21,771కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (5.46%), సన్ ఫార్మా (3.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.19%), టాటా స్టీల్ (2.02%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.53%), భారతి ఎయిర్ టెల్ (-3.25%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.28%), మారుతి (-2.22%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.79%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News