లోక్ సభ ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది: జీవన్ రెడ్డి వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి సీఎం అయిన కొన్నిరోజులకే విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్న జీవన్ రెడ్డి
- మద్యాన్ని గత ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుందని విమర్శ
- ఆడబిడ్డకు కల్యాణ లక్ష్మితో తులం బంగారం సాధ్యమేనని వ్యాఖ్య
ఎక్సైజ్ శాఖ గత ప్రభుత్వానికి ఆదాయమార్గంగా మారిందని, మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని ధ్వజమెత్తారు. బెల్ట్ షాపుల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. సీఎం రేవంత్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్లో వణుకు కనిపిస్తోందన్నారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమేనని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్కు అండగా నిలిచారన్నారు. ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం సాధ్యమే అన్నారు. హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లాలో కలపడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్లో కలపాలనే డిమాండ్ పరిష్కారమవుతుందన్నారు.