లోక్ సభలోకి చొరబడిన దుండగులు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా గుర్తింపు
- లోక్ సభలో పొగను వదులుతూ, నినాదాలు చేసిన దుండగులు
- పార్లమెంటు వెలుపల మరో ఇద్దరి నిరసనలు
- నలుగురిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల ఇదే తరహాలో ఆందోళనలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభలో పట్టుబడిన వారిని కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవ్ రాజ్ లుగా గుర్తించారు. పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేసిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. రంగుల పొగను వదులుతూ ఆమెతో పాటు మరొకరు నిరసన వ్యక్తం చేశారు. సదరు మహిళను హర్యానా హిస్సార్ కు చెందిన నీలం (42)గా గుర్తించారు. మరో వ్యక్తిని మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. లోక్ సభలోకి ప్రవేశించిన దుండగులు మైసూరు ఎంపీ పేరు మీద పాసులు తీసుకున్నట్టు తెలుస్తోంది.