తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి కాకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి: బండి సంజయ్
- యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ కులగణన చేయాలనే ఆలోచన చేయలేదన్న సంజయ్
- కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని విమర్శలు
- కేటీఆర్, రాహుల్ వ్యాఖ్యలు చూస్తుంటే బీసీ సీఎం కాకుండా కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్య
- బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్
తెలంగాణలో బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా రావని, అలాంటి పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుంది? అని అడుగుతూ, రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మొన్న మంత్రి కేటీఆర్, నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి కాకుండా చేసే కుట్రలు సాగుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. బీసీలకు రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఓబీసీల ఓట్లు అడగాలన్నారు.