తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గంభీర్ దంపతులు
- ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన గంభీర్
- క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్కు అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
- 140 కోట్ల మంది ప్రార్థనలతో ప్రపంచకప్ గెలుస్తామని ఆశాభావం
దర్శనం అనంతరం ఆలయం వెలుపల గంభీర్ మాట్లాడుతూ... వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్కు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో ప్రపంచ కప్ను కచ్చితంగా గెలుస్తామన్నారు. కాగా గంభీర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.