చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై నిన్న సుదీర్ఘ వాదనలు
- సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
- హైకోర్టులో బెయిల్ పిటిషన్ దరఖాస్తుకు అవకాశం
చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక బ్యారక్ ఇచ్చామని కోర్టుకు సీఐడీ తెలిపింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పారు. పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.