Vangaveeti Radha: విజయవాడలో లోకేశ్ ను కలిసిన వంగవీటి రాధా... నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు

  • మంగళగిరి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ యువగళం
  • నేటి సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశం
  • విజయవాడలో లోకేశ్ కు ఘనస్వాగతం
  • విజయవాడలో లోకేశ్ తో కలిసి పాదయాత్రలో నడిచిన వంగవీటి రాధా
  • మిన్నంటిన జై లోకేశ్, జై రాధా నినాదాలు
Vangaveeti Radha met Nara Lokesh in Vijayawada

విజయవాడలో ఈ సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించగా... టీడీపీ యువనేత నారా లోకేశ్ ను వంగవీటి రాధా కలిశారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

వంగవీటి రాధా... పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా నినాదాలు మిన్నంటాయి. "జై లోకేశ్, జై రాధా" అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. 

లోకేశ్ యువగళం పాదయాత్ర ఇవాళ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. లోకేశ్ రాకతో విజయవాడ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.

  • Loading...

More Telugu News