భారత్ తో టెస్టులకు పక్కాగా రెడీ అవుతున్న విండీస్
- సన్నాహక శిబిరానికి 18 మందితో జట్టు ఎంపిక
- జులై 12 నుంచి భారత్, విండీస్ మధ్య రెండు టెస్టులు
- డబ్ల్యూటీసీ కొత్త సీజన్ ను ప్రారంభించనున్న భారత్
జూన్9న ఈ టోర్నీ ముగిసిన తర్వాత సన్నాహక శిబిరంలో చేరే ఈ ఆటగాళ్లు ప్రధాన టెస్ట్ జట్టులో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఆంటిగ్వాలో ప్రారంభమయ్యే ఈ శిబిరంలో పాల్గొనే జట్టుకు కెప్టెన్ గా క్రెయిగ్ బ్రాత్వైట్ ఎంపికయ్యాడు. రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లు జెర్మైన్ బ్లాక్వుడ్, టాగెనరైన్ చందర్పాల్, రఖీమ్ కార్న్ వాల్, జాషువా డిసిల్వా, షనన్ గాబ్రియెల్, కీమర్ రోచ్ తదితరులు శిబిరంలో పాల్గొంటారు.
భారత టెస్టులకు వెస్టిండీస్ ప్రాథమిక జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథానాజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, న్క్రుమా బోన్నర్, టాగెనరైన్ చందర్పాల్, రఖీమ్ కార్న్ వాల్, జాషువా డిసిల్వా, షనన్ గాబ్రియెల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, ఆండర్సన్ ఫిలిప్, రేమాన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.