Prabhas: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్!

  • 'ఆది పురుష్'గా ప్రభాస్ 
  • ఈ నెల 16వ తేదీన సినిమా విడుదల 
  • సంగీతాన్ని అందించిన అజయ్ - అతుల్ 
  • ఆకట్టుకుంటున్న 'శివోహం' సాంగ్
Adi Purush movie song released

ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 'రామయణం'లోని 'అరణ్యకాండ' .. 'యుద్ధకాండ'లోని కథను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. 

శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ నటించిన ఈ సినిమాలో, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడుగా దేవ్ దత్ నటించారు. ఇటీవలే తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంటును గ్రాండ్ గా నిర్వహించారు. అప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వెళుతూ ఉన్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు. 

'మహా ఫాల నేత్ర .. ' అంటూ ఈ పాట సాగుతోంది. కథాపరంగా శివుడిని పూజిస్తూ రావణాసురుడు ఆలపించే పాట ఇది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. హరిచరణ్  ఆలపించాడు. అజయ్ - అతుల్ స్వరపరిచిన ఈ పాట వెంటనే కనెక్ట్ అవుతుంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News