ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు మరోమారు వేలం
- నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ
- మొత్తం 63 ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు
- జూన్ 30న ఈ-వేలం నిర్వహించనున్న అధికారులు
ఒక్కో ప్లాటు 464 చదరపు గజాల నుంచి 11,374 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్లాట్లకు కనీస ధరగా చదరపు గజానికి రూ.35 వేలుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి జూన్ 13న ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువును జూన్ 27గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.