Jagan: 'నిర్మల్ హృదయ్' భవన్ కు వెళ్లిన వైఎస్ జగన్, భారతి.. వీడియో ఇదిగో

Jagan and YS Bharathi went to Nirmal Hriday
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవనానికి వెళ్లారు. నిర్మల్ హృదయ్ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో జగన్ దంపతులు ముచ్చటించారు. పిల్లల యోగక్షేమాల గురించి అక్కడున్న నన్స్ ను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు నేటితో సీఎంగా జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర కీలక నేతలు జెండా ఎగురవేశారు. సజ్జల కేక్ కట్ చేశారు.
Go Back to Shorts
Jagan
YS Bharathi
YSRCP
Nirmal Hriday

More Telugu News