అభిమానం అంటే ఇది.. ధోనీ కోసం వచ్చి రైల్వే స్టేషన్లో నిద్రించిన ఫ్యాన్స్
- సీఎస్కే, జీటీ మధ్య ఐపీఎల్ ఫైనల్కు వర్షం అడ్డంకి
- నేటికి వాయిదా పడిన తుదిపోరు
- రాత్రి రైల్వే స్టేషన్లో తలదాచుకున్న ధోనీ అభిమానులు
దీంతో, అభిమానులంతా నిరాశగా వెనుదిరిగారు. ఈ రోజు ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్ కు వచ్చిన అభిమానులు వసతి లేక రైల్వే స్టేషన్లలో నిద్రిస్తూ కనిపించారు. స్టేడియం నుంచి తెల్లవారు జామున 3 గంటలకు స్టేషన్ చేరుకొని నేలపైనే పడుకున్నారు. వారిలో చాలా మంది ఎల్లో జెర్సీలు వేసుకొని ఉన్నారు. కేవలం ధోనీ కోసమే తాము ఇంతదూరం వచ్చామని, అతని ఆట చూసిన తర్వాతే తిరిగి వెళ్తామని చెబుతున్నారు. ఇలాంటి అభిమానుల కోసమైనా ఈ రోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అడ్డంకి లేకుండా జరగాలని, ధోనీసేన గెలవాలని అంతా కోరుకుంటున్నారు.