ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్.. మూడు రోజులు ఢిల్లీలోనే!
- రేపు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
- ఎల్లుండి కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం
- పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్సవం జరగనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగితేనే తాము వస్తామని చెపుతూ 20 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు హాజరవుతున్నాయి. టీడీపీ తరపున ఆ పార్టీ ఎంపీలు హాజరవుతారు.