Southeast Monsoon: నైరుతి రుతుపవనాల కబురు వచ్చేసింది!

  • ఈసారి కాస్త ఆలస్యంగా నైరుతి రుతుపవనాల రాక
  • జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశం
  • 96 శాతం వర్షపాతం నమోదవుతుందని గత నివేదికలో ఐఎండీ వెల్లడి
IMD announces Southeast monsoon onset

భారత్ లో అత్యధిక వర్షపాతం కలిగించే నైరుతి రుతుపవనాల సమాచారం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా రానున్నాయి. జూన్ 4వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి దేశంలో ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు ఆలస్యం కానుంది. 

ఇక, ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని అందిస్తాయని ఐఎండీ తెలిపింది. భారత్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఎంత త్వరగా మిగతా భాగాలకు వ్యాపిస్తాయన్న దానిపై ఆ ఏడాది వర్షపాతం ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తే ఆ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు త్వరగా విస్తరిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతుంటారు. 

ఐఎండీ ఇటీవల వెలువరించిన అంచనాల నివేదికలో... భారత్ లో ఈ ఏడాది నైరుతి సీజన్ లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఈ అంచనా 5 శాతం అటూ ఇటూగా ఉండొచ్చని వివరించింది.

More Telugu News