తెలంగాణ పోలీసులు ధైర్యవంతులు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి: కిషన్ రెడ్డి
- పోలీస్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న కిషన్ రెడ్డి
- కోట్ల రూపాయల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తోందని ప్రశ్న
- విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టిందని ఆరోపణ
రైతుల సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చారని, ధరణితో లక్షలాది మంది రైతులు, భూయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమిని ప్రొబేటరీ ల్యాండ్ గా ప్రకటించడం వల్ల చాలామంది కోర్టుల చుట్టు తిరుగుతున్నారన్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకొని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరి బారినపడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు.